జాతీయ రోడ్డు విస్తరణ వలన అదనంగా సేకరించిన భూమి కోల్పోయిన రైతులకునష్టపరిహారం త్వరితగతిన రైతులు కు అందజేయాలి:జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్

Spread the love

పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,ఏప్రిల్ 30 :-

జిల్లాలో పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లో ని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పెనుగొండ ఆర్డివో ఆనంద్,పుట్టపర్తి ఆర్డిఓ సువర్ణ కదిరి ఆర్డీవో శర్మ, ధర్మ వరం ఆర్డివో మహేష్ మరియు సంబంధిత తహసిల్దారులతో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించి అదనంగా భూ సేకరణ నిర్వహించడం జరిగింది.వాటికి సంబంధించిన రైతుల వివరాలు సేకరించిన భూమి లబ్ధిదారులకు నష్టపరిహారం త్వరితగతిన నష్ట పరిహారం అందించే విధిగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.వీలైనంత ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్ హెచ్ 716 (జి) బి.కొత్తకోట నుండి గోరంట్ల,గోరంట్ల నుండి హిందూపూర్,ప్యాకేజ్ నెంబర్ 2,టుఎన్ హెచ్ 544 బెంగళూరు –కడప విజయవాడ,ఎన్ హెచ్ 342 ముదిగుబ్బ – పుట్టపర్తి,పుట్ట పర్తి నుండి కోడూరు,ఎన్ హెచ్ 42 బత్తలపల్లి -ముదిగుబ్బ, ఎన్ హెచ్ 42 కదిరి కి సంబంధించి ఇప్పటివరకు జరిగిన భూ సేకరణ వివరాలు పెండింగ్ పనులపై జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. ముఖ్యంగా భూసేకరణ పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా త్వరగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని,అలాగే నష్టపరిహారాన్ని అందించడంలో ఎలాంటి జాప్యం లేకుండా రైతు లబ్ధిదారులకు అందించాలని సూచించారు.భూసేకరణ లో భాగంగా మంజూరైన నష్టపరిహారం అందించడంలో ఏమైనా కుటుంబ కోర్టు కేసులు పెండింగ్ ఉన్నట్లయితే వాటన్నింటినీ కోర్టులో డిపాజిట్ చేయుటకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా అదనంగా సేకరించినటువంటి భూములకు గ్డ్రాఫ్ట్ అవార్డులు సిద్ధం చేయాలని ఆదేశించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భూమిని సబ్ డివిజన్ చేసేటప్పుడు ఎమ్మార్వోలు జాగ్రత్తగా చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో ల్యాండ్ ఎక్కువైజేషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య పుట్టపర్తి తహసీల్దార్ కళ్యాణ్,కొత్తచెరువు డిటి బాల ఆంజనేయులు,హిందూపురము వెంకటేష్,తలపుల రెడ్డి శేఖర్,కదిరి మురళి కృష్ణ, డిటి మహబూబ్ బాషా, గోరంట్ల చిలమత్తూరు, ముదిగుబ్బ నారాయణస్వామి, బుక్కపట్నం ఎమ్మార్వో కే షబీనా,ఓడిసి,ధర్మవరం , మండలాల తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    Spread the love

    Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!