యాదాద్రి భువనగిరి జిల్లా జూలై.28,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి:-అంగన్వాడీ కేంద్రాల అప్ గ్రేడేషన్ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే అధికారులను ఆదేశించారు.జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి,పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు,మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కరుణాకర్ తో కలెక్టర్ సమావేశమయ్యారు.జిల్లాలో అంగన్వాడి కేంద్రాలు అప్ గ్రేడేషన్ కోసం మొత్తం రూ.98.13లక్షలు విడుదలైనట్లు తెలిపారు.





