2.వేల నోట్ల డిపాజిట్లు 50 వేలు దాటితే పాన్ కార్డ్ తప్పనిసరి..1000 రూపాయల నోట్లు చలామణిలో కి తీసుకురాం : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

Spread the love

జనసముద్రం న్యూస్, మే 22:

రూ.2 వేల నోటును చలామణిలో నుంచి తప్పిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొద్ది రోజుల క్రితం సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. కాగా రూ.2 వేల నోటుకు సంబంధించి అంశంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మరింత స్పష్టతనిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

నగదు నిర్వహణలో భాగంగానే రూ.2000 నోట్లను  ఉపసంహరించుకుంటున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. 2016లో నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి వేగంగా నగదును తీసుకురావడానికే రూ.2000 నోటును ప్రవేశపెట్టినట్టు తెలిపారు.ఈ నేపథ్యంలో రూ. 2 వేల నోట్ల మార్పిడికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేశామని శక్తికాంత దాస్ తెలిపారు.ఈ నేపథ్యంలో సెప్టెంబరు 30 నాటికి చాలా వరకు రూ.2000 నోట్లు ఖజానాకు చేరతాయని ఆకాంక్షిస్తున్నామన్నారు.

రూ.2 వేల నోట్ల మార్పిడి సమయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందన్నారు. నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద ప్రజలు హడావుడి పడాల్సిన అవసరం లేదన్నారు. ఇందుకు సెప్టెంబర్ 30 వరకు నాలుగు నెలల సమయం ఇచ్చామని చెప్పారు. కాగా కొందరు వ్యాపారులు గతకొంత కాలం నుంచే రూ.2000 నోట్లను  తిరస్కరిస్తున్నారని తెలిపారు. రూ.2 వేల ఉపసంహరణ ప్రకటన తర్వాత అది మరింత ఎక్కువై ఉంటుందని శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు.కాగా రూ.50000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్ కార్డు సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉన్నట్లు శక్తికాంత్ దాస్ గుర్తు చేశారు. ఆ నిబంధన రూ.50 వేలకు మించి చేసే రూ.2000 నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

మే 23 నుంచి బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రూ.2000 నోట్లను బ్యాంకులు వెనక్కి తీసుకుని ప్రజలకు ఇతర నోట్లను ఇచ్చేందుకు తగినంత నగదు కూడా అందుబాటులో ఉంచామన్నారు. రూ.2 వేల నోటు ఉపసంహరణ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చాలా తక్కువేనని వెల్లడించారు.చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2000 నోట్ల వాటా కేవలం 10.18 శాతం మాత్రమేనని గుర్తు చేశారు. అలాగే రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టనున్నారని వస్తున్న వార్తలు కూడా కేవలం ఊహాగానాలేనని తెలిపారు.

ఇక పెద్ద మొత్తంలో అయ్యే డిపాజిట్లను తనిఖీ చేసే అంశాన్ని ఆదాయ పన్ను శాఖ (ఐటీ శాఖ) చూసుకుంటుందని శక్తికాంత్ దాస్ తెలిపారు. ఈ విషయంలో బ్యాంకులకు నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయన్నారు. వాటినే ఇప్పుడూ అమలు చేస్తాయని తెలిపారు.

  • Related Posts

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    గ్యాంగ్ రేప్.. హత్య.. దేశానికీ సిగ్గు చేటు :అల్లెం కోటి.

    Spread the love

    Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,మణుగూరు, జూలై 21. మణిపూర్ లో మెజారిటీ వర్గమైనమైతేయిన్ లు, మైనార్టీలైన కుకీ గిరిజనులకు మధ్య హింస పేట్రేగిన మే 3వ తేదీ తర్వాతి రోజే ఈ ఘటన జరిగినట్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!