సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదం, పేకాట లాంటి పందాలుగా నిర్వాహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా నీల్వాయి ఎస్.ఐ నరేష్ వేమనపల్లి మండల ప్రజలకు హెచ్చరిక తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంటుందని, కోడి పందాలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. చట్ట విరుద్ధంగా పందాలు నిర్వహించిన, అలాగే పేకాట ఆడినా చర్యలు తప్పవన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఈ పందాలకు దూరంగా ఉండాలని ఎస్.ఐ విజ్ఞప్తి చేశారు.





