10 కోట్ల మంది జనాభా ఉంటే అందులో కోవిడ్ -19 బారిన పడ్డ 9 కోట్ల మంది..!

Spread the love

జనసముద్రం న్యూస్, జనవరి 10:

చైనాలోని మూడవ అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్లో దాదాపు 90% మంది ప్రజలు ఇప్పుడు కోవిడ్ -19 బారిన పడ్డారని దేశం కరోనా కేసులతో పోరాడుతోందని చైనా ప్రభుత్వ ఉన్నత అధికారి సోమవారం సంచలన విషయాన్ని బయటపెట్టాడు.  సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్కు సంబంధించిన ఆరోగ్య కమిషన్ డైరెక్టర్ కాన్ క్వాన్చెంగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “జనవరి 6 2023 నాటికి ప్రావిన్స్ లోని మొత్తం జనాభాలో కోవిడ్ ఇన్ఫెక్షన్ రేటు 89.0 శాతంగా ఉందని.. అక్కడ 10 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 9 కోట్ల మందికి సోకిందని బాంబు పేల్చారు. అక్కడ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉందని తెలిపారు.

99.4 మిలియన్ల జనాభాతో ఉండే హెనాన్ ఫ్రావిన్స్ లో 88.5 మిలియన్ల మంది ప్రజలు ఇప్పుడు కరోనా వ్యాధి బారిన పడి ఉండవచ్చని గణాంకాలు బయటపెట్టారు. డిసెంబరు 19న ఫీవర్ క్లినిక్ల సందర్శనలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. “తర్వాత అది నిరంతరంగా తగ్గుముఖం పట్టింది” అని అధికారి చెప్పారు.చైనా కఠిన లాక్ డౌన్ తో ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతింది. ఆ తర్వాత ప్రజల్లో ఈ లాక్ డౌన్ పై  అరుదైన దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. సంవత్సరాల తరబడి లాక్డౌన్లు నిర్బంధాలు మరియు సామూహిక పరీక్షలను ఎత్తివేయాలని గత నెలలో ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. లాక్ డౌన్ ఎత్తివేసింది. ఈ తీసుకున్న నిర్ణయం తరువాత కేసుల పెరుగుదలతో పోరాడుతోంది. కంట్రోల్ చేయడం చైనా వల్ల కావడం లేదు.

అయినా కూడా చైనా దాని పునఃప్రారంభాన్ని కొనసాగించాలని నిశ్చయించుకుంది ఆదివారం అన్ని అంతర్జాతీయ రాకపోకలకు తప్పనిసరి నిర్బంధాన్ని ఎత్తివేసి సెమీ అటానమస్ దక్షిణ నగరమైన హాంకాంగ్తో సరిహద్దును తెరిచింది.అయితే ఈ నెలాఖరులో దేశం చాంద్రమాన నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నందున అంటువ్యాధులు పెరుగుతాయని భావిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని బలహీనమైన వృద్ధ బంధువులను సందర్శించడానికి మిలియన్ల మంది పెద్ద నగరాల నుండి ప్రయాణించాలని భావిస్తున్నారు.

ప్రీ-హాలిడే ట్రావెల్ మొదటి వేవ్లో అధికారిక సమాచారం ప్రకారం శనివారం 34.7 మిలియన్ల మంది దేశీయంగా ప్రయాణించారు . గత సంవత్సరంతో పోలిస్తే మూడవ వంతు కంటే ఎక్కువ దీంతో మరింతగా కరోనా ప్రబలడం ఖాయమంటున్నారు.డిసెంబరు ప్రారంభంలో చైనా కోవిడ్ నియంత్రణలను సడలించినప్పటి నుండి కేవలం 120000 మంది ప్రజలు సోకినట్లు 30 మంది మరణించినట్లు అధికారిక డేటా గత వారం చూపించింది.

బీజింగ్ గత నెలలో కోవిడ్ మరణాల నిర్వచనాన్ని తగ్గించడంతో సామూహిక పరీక్ష ఇకపై తప్పనిసరి కాదని తెలిపింది. దీంతో కేసులను చైనా బయటపెట్టడం లేదు. దాని డేటా వ్యాప్తి ని దాచేస్తోంది.  నిజమైన స్థాయిని బయటపెట్టకపోవడంతో చైనాలో కరోనా కల్లోలం గణాంకాలు బయటకు రావడం లేదు.

Related Posts

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

Spread the love

Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

Spread the love

Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!