మహిళలు చదువుకొకపోవడం వల్లే జనాభా పెరుగుతోంది అంటూ మేధావి సీఎం వివాదాస్పద వాఖ్యలు..సీఎం పదవికే కళంకం తెస్తున్నారని బీజేపీ ఫైర్

Spread the love

జనసముద్రం న్యూస్,జనవరి 9:

రాజకీయ మేధావిగా పేరుతెచ్చుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్.. ఆ రాష్ట్రంలో కుల గణన చేపట్టి దేశంలో టాక్ ఆఫ్ది సెంట్రిక్గా నిలిచారు. ఎవరూ చేయని సాహసం చేశారంటూ.. ఆయన చుట్టూ ప్రశంసలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇంతలోనే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా బద్నాం అయ్యారు. దేశంలో జనాభా పెరిగిపోతోందని అన్న ఆయన దీనికి కారణం మహిళలేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పనిలేని మహిళలకు పిల్నల్ని కనడమే పని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతటితో కూడా ఆగకుండా.. మహిళలు చదువుకోకపోవడంతోపాటు పురుషులు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల జనాభా నియంత్రణ సాధ్యంకావడం లేదని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేపట్టిన ‘సమాధాన్ యాత్ర’లో భాగంగా వైశాలిలో జరిగిన బహిరంగ సభలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు చదువుకుంటే సంతానోత్పత్తి రేటు తగ్గుతుందన్నారు. ఇది వాస్తవమని నేడు మహిళలు చదువుకోవడం లేదని అన్నారు.ప్రతిరోజూ పిల్లల్ని కనడమే మహిళలు పనిగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఇక పురుషులు కూడా ఇదే విషయాన్ని అనుసరిస్తున్నారని వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులైతే లేదా గర్భధారణను నిరోధించేందుకు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు పాటించాలో తెలిస్తే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు.

ఇక నితీష్కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. దేశంలో సంతానోత్పత్తి రేటు గురించి వివరించడానికి సరైనది కానటువంటి భాషను ఆయన ఉపయోగించారని ఆరోపించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అమర్యాదకరమైన భాషను బహిరంగంగా ఉపయోగించారని ఆరోపించారు. ఇటువంటి భాషను ఉపయోగించడం ద్వారా ఆయన ముఖ్యమంత్రి పదవి ఔన్నత్యానికి కళంకం తెస్తున్నారన్నారు. ఆయనలో నైతికత ఉంటే రాజీనామా చేయాలన డిమాండ్ చేశారు.

Related Posts

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

Spread the love

Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

గ్యాంగ్ రేప్.. హత్య.. దేశానికీ సిగ్గు చేటు :అల్లెం కోటి.

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,మణుగూరు, జూలై 21. మణిపూర్ లో మెజారిటీ వర్గమైనమైతేయిన్ లు, మైనార్టీలైన కుకీ గిరిజనులకు మధ్య హింస పేట్రేగిన మే 3వ తేదీ తర్వాతి రోజే ఈ ఘటన జరిగినట్లు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!