టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై విచారణకు ఉరవకొండ చేరుకున్న ఎన్నికల ప్రధాన అధికారి..ఇద్దరు బీఎల్వో లను సస్పెండ్ చేసిన కలెక్టర్ నాగలక్ష్మి..!

Spread the love

జనసముద్రం న్యూస్,జనవరి 4:

వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలని భావిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.. ఈ క్రమంలో చేస్తున్న కొన్ని పనులు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు వలంటీర్లను ఉపయోగించుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ముందే అలెర్ట్ అయిన టీడీపీ… దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం.. ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుని సరిదిద్దాలని.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి తాజాగా లేఖ రాసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకునే పనిలో పడింది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ విజయం దక్కించుకున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.2014లో ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి(నక్సల్స్ మాజీ సానుభూతిపరుడు) విజయం దక్కించుకున్నారు. అయితే.. ఇటీవల కాలంలో టీడీపీ దూకుడు ఎక్కువగా ఉంది. దీంతో విశ్వేశ్వరరెడ్డి సూచనల మేరకే.. ఇక్కడ తమ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని పయ్యావుల ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. ఈ క్రమంలో తాజాగా ఇక్కడ ఆడిట్ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని నిగ్గు తేల్చటానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారి స్వయంగా ఉరవకొండకు చేరుకున్నారు. మరోవైపు సీఈసీ ఆదేశాలతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హడావిడిగా ఇద్దరు బీఎల్వోలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామం.. వైసీపీని డిఫెన్స్లో పడేసిందని అంటున్నారు పరిశీలకులు.     

Related Posts

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

Spread the love

Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

Spread the love

Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!