మా ముఖ్యమంత్రి పట్టపగలే తాగుతున్నాడు..తాగుతూనే పాలన సాగిస్తున్నాడు..లోక్ సభ సాక్షిగా ముఖ్యమంత్రి పై ఎంపీ ఫైర్..!

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 22:

మా ముఖ్యమంత్రి పట్టపగలే తాగుతున్నాడు. తాగుతూనే పాలన సాగిస్తున్నాడు“ అంటూ.. ఓ ఎంపీ చేసిన కామెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండడం గమనార్హం.

పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ లోక్సభలో సంచల న ఆరోపణలు చేశారు. మద్యం మత్తులో భగవంత్ మాన్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. మద్యం తాగి పార్లమెంట్లో కూర్చున్న వ్యక్తి(గతంలో మాన్ ఎంపీ) ఇప్పుడు డ్రగ్స్ సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని కౌర్ వ్యాఖ్యానించారు.

లోక్సభలో మాట్లాడిన ఆమె.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తప్పతాగి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు. ఆప్పై హర్సిమ్రత్ ఈ విమర్శలు చేసిన సమయంలో సభలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం నవ్వులు చిందించారు.”మా సీఎం ఉదయం 11 గంటలకే మద్యం మత్తులో పార్లమెంట్కు వచ్చి కూర్చునేవారు. ఆయన పక్కన కూర్చున్న సభ్యులు తమ సీటును మార్చాలని కోరేవారు. ఇప్పుడు ఆయన రాష్ట్రాన్నే నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రే ఇలా ఉంటే.. రాష్ట్రం పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘తాగి వాహనాలు నడపొద్దు’ అనే బోర్డులు మనకు రోడ్లపై కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు వారు ‘తాగి రాష్ట్రాన్నే నడిపిస్తున్నారు“  అని ఎంపీ  కౌర్ వ్యాఖ్యానించారు.

వృత్తిరీత్యా కమెడియన్ అయిన సీఎం భగవంత్ మాన్.. రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. పంజాబ్లోని సంగ్రూర్ స్థానం నుంచి 2014 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. దీంతో సీఎంగా మాన్ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ఎక్కువగా మద్యం సేవిస్తారని విపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి.పార్లమెంట్కు సైతం మత్తులోనే వచ్చేవారని చెబుతుంటాయి. ఈ విమర్శలపై 2019లోనే కేజ్రీవాల్ బహిరంగంగా స్పందించారు. మాన్ మారిపోయారని.. మద్యం పూర్తిగా మానేశారని గతంలోనే ప్రకటించారు.  ఇక ఇటీవల ఆయన విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఆయనను మద్యం మత్తులో ఉన్నారంటూ.. విమానం నుంచి దింపేసిన ఘటన కూడా సంచలనం సృష్టించింది.

  • Related Posts

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    గ్యాంగ్ రేప్.. హత్య.. దేశానికీ సిగ్గు చేటు :అల్లెం కోటి.

    Spread the love

    Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,మణుగూరు, జూలై 21. మణిపూర్ లో మెజారిటీ వర్గమైనమైతేయిన్ లు, మైనార్టీలైన కుకీ గిరిజనులకు మధ్య హింస పేట్రేగిన మే 3వ తేదీ తర్వాతి రోజే ఈ ఘటన జరిగినట్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!