విద్యార్థులకు సీఎం జగన్ పుట్టినరోజు కానుక.. శాంసంగ్ ఏ7 ట్యాబ్

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 20:

ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు డిసెంబర్ 21న పురస్కరించుకుని ఆ పార్టీ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. రక్తదానాలు అన్నదానాలు వస్త్ర దానాలు పేదలకు పండ్లు పంపిణీ వంటివాటిని చేపట్టడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబులను అందజేయనుంది.డిసెంబర్ 21వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్కు 50 ఏళ్లు నిండనున్నాయి ఈ ‘గోల్డెన్ జూబ్లీ’ సందర్భాన్ని పురస్కరించుకుని వైసీపీ ప్రభుత్వం పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ట్యాబ్లను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది.

జూన్లో వైసీపీ ప్రభుత్వం ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ.. బైజూస్ తో మౌలిక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది ఈ ఒప్పందంలో  భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను అందజేయనుంది. అలాగే బైజూస్ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఉచితంగా కంటెంట్ ను ఆ ట్యాబుల్లో అప్ లోడ్ చేయించనుంది.ఈ నెల 21న ఈ పథకాన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం సగాన్ని దాటిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న దాదాపు 4.7 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థులకు ఈ ట్యాబ్ అందిస్తామని విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.

విద్యార్థులకు అందించే ట్యాబ్.. శాంసంగ్ ఏ7. ఇది 8.8 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటుంది. దీని ప్రస్తుత మార్కెట్ ధర రూ.14000 నుండి రూ.15000 వరకు ఉంటుందని చెబుతున్నారు.ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ట్యాబ్ల కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేస్తోంది. బైజూస్ వీటికి సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందజేస్తోంది.

ట్యాబ్ పొందిన ప్రతి విద్యార్థికి కోడ్ ఇస్తామని కమిషనర్ సురేష్కుమార్ తెలిపారు. “విద్యార్థి ట్యాబ్తో ఏమి చేసినా సర్వర్లో నిక్షిప్తమై ఉంటుంది. దీన్ని ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తారు. విద్యార్థులు ట్యాబ్ను గరిష్టంగా వినియోగించుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని భావిస్తున్నాం” అని కమిషనర్ సురేష్ అన్నారు.

Related Posts

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

Spread the love

Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

Spread the love

Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!