హాఫ్ సెంచరీ దాటనున్న ఏపి ప్రభుత్వ సలహాదారుల జాబితా..హైకోర్టు కొత్త సలహాదారులు వద్దని చెప్పినా పట్టించుకోని ఏపి ప్రభుత్వం.!

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 4

ఏపీలో సలహాదారుల జాబితా అంతకంతకు పెరిగిపోతోంది. వారు ఏమి చేస్తారో ఏమి చేయాలని ప్రభుత్వం వారిని నియమించుకుందో జన సామాన్యానికి తెలియదు. అయితే గతంలో అప్పటి ప్రభుత్వాలలో సలహాదారులు ఉన్నా ఇంత ఎక్కువ సంఖ్యలో మాత్రం లేరు. కానీ ఇపుడు చూస్తూండగానే అర్ధ సెంచరీ దాటిపోయింది నంబర్. ఇది మరింతగా పెరుగుతోంది కూడా.

లేటెస్ట్ గా మరో ఇద్దరు సలహాదారులను ప్రభుత్వం నియమించింది. వ్యవసాయ శాఖకు తిరుపాల్ రెడ్డి ఉద్యాన శాఖకు శివప్రసాద్ రెడ్డిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవులలో వీరు రెండేళ్ల పాటు కొనసాగుతారు అని పేర్కొంది.దీనికి ముందు కొద్ది రోజుల క్రితం పంచాయతీ రాజ్ శాఖకు కూడా కొత్త  సలహాదారునిగా పోతినేని నాగార్జున రెడ్డిని  నియమించారు. ఇలా చూస్తూ పోతే ఈ సంఖ్య అర్ధ సెంచరీ దాటేసి సెంచరీకు చేరుకుంటుందా అన్న డౌట్ వస్తోందిట. ఇక చూస్తే ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించవద్దని హై కోర్టు పేర్కొంది. ఆ నియామకాలను వ్యతిరేకించింది.

గతంలో దేవాదాయ శాఖకు సలహాదారునిగా జ్వాలాపురం శ్రీకాంత్ ని నియమించగా హై కోర్టు ఆ నియామకం మీద స్టే ఇచ్చింది. అయినా సరే ఇపుడు వరసబెట్టి కీలకమైన ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమిస్తున్నారు. మరి ఈ నియామకాలు ఎంతవరకూ చెల్లుతాయో ఏమో తెలియదు అంటున్నారు. అదే సమయంలో ఈ పదవులు తీసుకున్న వారు ఒకవేళ చేయాలంటే ఏ పని ఉంది అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.అనేక ప్రాధాన్యత కలిగిన శాఖలకు మంత్రులు ఉంటారు. అధికారులు ఉంటారు. ఎంతో పెద్ద వ్యవస్థ ఉంటుంది. మళ్ళీ ప్రత్యేకంగా సలహాదారులను వాటిని నియమించి వారి నుంచి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అన్న చర్చ వస్తోంది. అదే టైంలో సలహాదారులకు వేతనాలు ఖర్చు వారి మీద  ప్రభుత్వం పెట్టే వ్యయం అన్నీ కూడా ఇపుడున్న పరిస్థితులలో అవసరమా అన్న పాయింట్ ని కూడా కొంతమంది లేవనెత్తుతున్నారు.

అయితే చాలా మంది   వైసీపీ  ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకు పదవులు ఇవ్వలేకపోతున్నారు. వారిలో అసంతృప్తి పేరుకుపోతోంది. దాంతో వారి కోసం రాజకీయ పునరావాసంగా ఈ నియామకాలు చేపడుతున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీని మీద విపక్షాలు కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నాయి. ఎందుకు ఇంతమంది సలహాదారులు వారు చేసే పనులు ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నాయి.
అయినా సరే వైసీపీ వీరిని వరసబెట్టి నియమిస్తోంది అంటే రాజకీయ ప్రయోజనాలు ఎన్నికల అవసరాలు దృష్టిలో ఉంచుకునే ఈ నియామకాలు జరుగుతున్నాయని అంటున్నారు.  ఏది ఏమైనా సలహాలు ఇచ్చేవారు ఉండాలి కానీ వారే ఎక్కువ అయిపోతే అయోమయం గందరగోళం ఏర్పడుతుంది అన్న వారూ ఉన్నారు.

Related Posts

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

Spread the love

Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

Spread the love

Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!