సీఎం జగన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 5 న కర్నూల్ లో రాయలసీమ గర్జన మరియు డిసెంబర్ 7న విజయవాడలో బీసి గర్జన : విజయవంతం చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పిలుపు

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 2 :

●అంబెద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వైఎస్‌ జగన్‌..!

●అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని కోరుకునే గొప్ప మనసున్న వాళ్లం..!

బిసిలను బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌గా పరిగణించడం తప్పు, బ్యాక్‌బోన్‌ క్లాసెస్‌గా సమాజం పరిగణించాలన్నదే జగన్‌మోహన్‌ రెడ్డి గారి ఆలోచనా విధానం అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి గారు స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురంలోని వైసిపి కార్యాలయంలో ఈనెల 5న కర్నూలులో జరగనున్న ‘రాయలసీమ గర్జన’ పోస్టర్లను అనంతపురం ఎంపి తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, పార్టి జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బోయ గిరిజమ్మ తదితరులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మా ప్రభుత్వానికి, మా పార్టీకి వెన్నుముకగా బిసిలున్నారనే విధానాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. గత 40 నెలులుగా అవలంభించిన బిసిల పక్షపాత విధానాం ప్రజలకు తెలుసు. వెనుకబడిన వర్గాల వారిని ముందుకు తీసుకువచ్చి సమ సమాజ స్థాపన చేసినప్పుడే, ఎన్నో బలిదానాలు చేసి సాధించుకున్న స్వాతంత్రానికి ఒక విలువ ఉంటుందని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చెప్పిన విధానాన్ని జగన్‌మోహన్‌రెడ్డి అవలంభిస్తున్నారు. 7న విజయవాడలో జరిగే బీసీ గర్జనను విజయవంతం చేయాలి.

●రాయలసీమ ఆత్మగౌరవ పోరాటంగా, రాయలసీమ వెనుకబాటు తనానికి సంబంధించి అనేక డిమాండ్లతో ఈనెల 5న కర్నూలులో ‘రాయలసీమ గర్జన’ సదస్సు నిర్వహిస్తున్నాం. 70 ఏళ్లుగా అనేక మోసాలకు గురవుతున్న రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాలను రాయలసీమ వేదికగా స్పష్టం చేయాల్సి ఉంది. మేమంతా ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే గొప్ప మనసున్న వాళ్లం. రాజధానిలో త్యాగం చేసినవాళ్లం. మా త్యాగాలను చేతగానితనంగా చూడొద్దు. భవిష్యత్‌ తరాల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాయలసీమ ప్రజలందరూ అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతున్నారు. రాష్ట్రంలోని 16 వేల గ్రామాల్లోనూ అభివృద్ధి జరగాలి. రాయలసీమల, అమరావతి, ఉత్తరాంధ్రలోనూ జరగాలి. అందరూ బాగుండాలి అనే వాదనను ఈనెల 5న కర్నూలు జరిగే ‘రాయలసీమ గర్జన’లో వినిపించబోతున్నాం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఇతర మేధావులు, రాయలసీమ వాదులందరూ వేలాదమందిగా తరలివచ్చి విజయవంతం చేయాలని తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి గారు పిలుపునిచ్చారు.

  • Related Posts

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    Spread the love

    Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!