ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు సహకరించండి, ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ దీపక్ బగ్లాను కోరిన మంత్రి అమర్నాథ్

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్1,విశాఖపట్నం,

రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. గడచిన మూడు సంవత్సరాలలో పలు కొత్త కంపెనీలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరికొన్ని కంపెనీలు ఉత్పత్తికి సిద్ధంగా ఉండగా, రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన ఆదేశాలతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి అమర్నాథ్ గురువారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన ఇన్వెస్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో దీపక్ బగ్లాతో భేటీ అయ్యారు.

భారతదేశంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచే యాజమాన్యాలకు ఇన్వెస్ట్ ఇండియా సంస్థ మార్గదర్శకంగా నిలుస్తుంది. ఏఏ పరిశ్రమలు ఏఏ రాష్ట్రాల్లో నెలకొల్పడానికి అనువైన పరిస్థితులు ఉంటాయన్న సమాచారాన్ని ఈ ఇన్వెస్ట్ ఇండియా సంస్థ తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి అమర్నాథ్ దీపక్ బగ్లాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలు నెలకొల్పటానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని అమర్నాథ్ ఆయనకు తెలియజేశారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే యాజమాన్యాలను తొలుత ఆంధ్రప్రదేశ్ కు పంపించాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సరళమైన పారిశ్రామిక విధానo అమల్లో ఉందని, మౌలిక సదుపాయాలతో కూడిన భూమి అందుబాటులో ఉందని, దీంతోపాటు నైపుణ్యం కలిగిన సిబ్బంది కూడా ఏపీలో పుష్కలంగా ఉన్నారని మంత్రి అమర్నాథ్, దీపక్ బగ్లాకు చెప్పారు. మంత్రి అభ్యర్థనపై దీపక్ సానుకూలంగా స్పందించారు.

ఇదిలా ఉండగా వచ్చే ఏడాది మార్చి నెలలో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్-2023 నిర్వహణపై కూడా మంత్రి అమర్నాథ్, దీపక్ బగ్గ తో చర్చించారు. ఈ సదస్సుకు ఏఏ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలన్నటువంటి అంశాలపై చర్చించారు.
మంత్రి అమర్నాథ్ వెంట ప్రభుత్వ విప్ ధర్మ శ్రీ, పరిశ్రమ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ సృజన తదితరులు ఉన్నారు.

  • Related Posts

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    Spread the love

    Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!