బీసీలను నట్టేట ముంచిన ఏకైక ప్రభుత్వం వైకాపా.

Spread the love

✦కార్పొరేషన్లు ఫుల్ – నిధులు నిల్.

✦రాష్ట్రంలో 26 మంది బీసీ నాయకులను పొట్టన పెట్టుకున్న వైకాపా ప్రభుత్వం.

✦బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా ఆర్థికంగా బీసీలను అనగదొక్కిన జగన్.

✦డిసెంబర్ 8న వైకాపా బీసీ సమావేశంలో బీసీలకు ఏం చేశావని సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి.

✦బీసీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్పొరేషన్లు ఫుల – నిధులు నిల్ కార్యక్రమంలో మాజీ మంత్రి కాలువ,మాజీ ఎమ్మెల్యేలు వైకుంఠం,జితేంద్ర గౌడ్,వడ్డే వెంకట్,టిడిపి నాయకులు

జనసముద్రం న్యూస్:నవంబర్,28.జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్:

అనంతపురం న్యూస్: రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని అనంతపురం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు,మాజీ ఎమ్మెల్యేలు వైకుంఠ ప్రభాకర్ చౌదరి,జితేంద్ర గౌడ్ టిడిపి వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్ లు విమర్శించారు.సోమవారం ఉదయం అనంతపురం నగరం లోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా టిడిపి బీసీ సెల్ ఆధ్వర్యంలో కార్పొరేషన్లు ఫుల్ – నిధులు నిల్ అనే కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా టిడిపి బిసి నాయకులతో కలిసి వడ్డే వెంకట్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా వడ్డే వెంకట్ మాట్లాడుతూ నిధులు,విధులు లేని పదవులు బీసీలకు అప్పజెప్పి రాజభోగాలు వున్న పదవులు రెడ్లకు కట్టబెట్టిన ఘనత జగన్ రెడ్డిది అని,తెదేపా హాయంలో బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి వ్యక్తికి 2 లక్షల రూపాయలు వరకు లబ్ది చేకూరేదని ఇప్పుడు జగన్ రెడ్డి బీసీ కార్పొరేషన్ మొత్తానికి కేవలం 2 లక్ష రూపాయలు ఇస్తే ఆ డబ్బులతో పప్పులు,బెల్లాలు పంచుకోవాలా అని ఎద్దేవా చేశారు.బీసీలకు విదేశీ విద్య ద్వారా బీసీ విద్యార్థుల ఉన్నతకి నారా చంద్రబాబు నాయుడు చేయూతను అందించారని తెలిపారు.బీసీలను 26 మందిని ఊచకోత కోసి పొట్టన పెట్టుకుని 2650 మంది బీసీ నాయకులు పై అక్రమ కేసులు పెట్టించి,ఆస్తులు ధ్వంసం చేయ్యించి బీసీలకు తీరని అన్యాయం చేసి ఇప్పుడు బీసీల సభ అంటూ ఓట్ల కోసం బీసీలను మోసం చేయడానికి మళ్ళీ రెడీ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని వడ్డే వెంకట్ ఘాటుగా విమర్శించారు.టిడిపి బీసీ రాష్ట్ర నాయకులైన మాజీ మంత్రులు అచ్చం నాయుడు,యనమల రామకృష్ణుడు,అయ్యన్న పాత్రుడు,కొల్లు రవీంద్ర మరియు మహిళా నాయకులు గౌతు శిరీష,భవాని,పంచుమర్తి అనురాధ,తదితరులపై అక్రమంగా కేసులు పెట్టించి వేధించిన చరిత్ర మీది కాదా జగన్మోహన్ రెడ్డి,డిసెంబర్ 8న వైకాపా బిసి సమావేశంలో ఈ రాష్ట్ర బీసీలకు ఏమని సమాధానం చెప్తావు.?జగన్మోహన్ రెడ్డి అని వడ్డే వెంకట్ ప్రశ్నించారు.నామినేటెడ్ పదవులన్నీ మీ వర్గానికి కట్టబెట్టి డమ్మీ పదవులు బీసీలకు కేటాయించానని చెబుతావా,56 కార్పొరేషన్లను కు నిధులు విధులు,కేటాయించకుండా పూర్తిగా నిర్వీర్యం చేశావని చెప్తావా ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకొని వైకాపా బీసీ సభ నిర్వహిస్తారో సమాధానం చెప్పాలని వడ్డే వెంకట్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి బిసి సెల్ జిల్లా అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య,బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు,టిడిపి నాయకులు ఆలం నరసానాయుడు,వెంకట శివుడు,యాదవ్,ఆది నారాయణ,వెంకటాపురం నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    Spread the love

    Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!