
జన సముద్రం న్యూస్, నవంబర్26,ఆత్మకూరు.:
రాబోయే సార్వత్రిక ఎన్నికల సమరానికి ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని రాప్తాడు నియోజకవర్గంలో ఆత్మకూరు మండలం చాలా కీలకం అని పరిటాల శ్రీరామ్ తెలిపారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని శ్రీరామ్ తెలిపారు.
రాష్ట్రం పాలన అస్తవ్యస్తంగా మారింది తిరిగి నవ్యాంధ్ర నిర్మాణం చెప్పట్టలంటే తెలుగు దేశం పార్టీని అధికారం లోకి తీసుకురావాలని అందుకు రాష్ట్రం లో యువత చాలా కీలకం అని ఆత్మకూరు తెలుగు దేశం యువ నాయకుల సమావేశం లో పరిటాల శ్రీరామ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మురళి,ఏకాంత్,అజయ్,మంజు, దినేష్,గంగ,మురళి తదితరులు పాల్గొన్నారు.





