
హైదరాబాద్: అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 38 శబరిమల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. హైదరాబాద్-కొల్లాంకు డిసెంబరు 5, 12, 19, 26, జనవరి 2, 9, 16 తేదీల్లో.. కొల్లాం-హైదరాబాద్కు డిసెంబరు 6, 13, 20, 27, జనవరి 3, 10, 17.. నర్సాపూర్ – కొట్టాయం డిసెంబరు 2, 9, 16, 30, జనవరి 6, 13.. కొట్టాయం-నర్సాపూర్ డిసెంబరు 3, 10, 17, 24, జనవరి 7, 14.. సికింద్రాబాద్-కొట్టాయం డిసెంబరు 4, 11, 18, 25, జనవరి 1, 8.. కొట్టాయం-సికింద్రాబాద్ డిసెంబరు 4, 11, 18, 25, జనవరి 2, 9 తేదీల్లో రైళ్లు బయలుదేరుతాయి.





