డిసెంబర్ 5 న ప్రధాని అధ్యక్షతన జరగనున్న వివిధ రాజకీయ పార్టీల సమావేశానికి చంద్రబాబు..!

Spread the love

ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీలను కలుపుకుని ముందుకు వెళ్లాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఏపీ బీజేపీ నేతలు తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని.. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమని చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో సువర్ణావకాశం తలుపుతట్టింది. డిసెంబర్ 5న ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులతో కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయనుంది.

ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనుంది. ఇందులో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి ఈ సమావేశానికి చంద్రబాబును ఆహ్వానించారు.

ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగానూ కేంద్రం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా చంద్రబాబు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు.

తాజాగా మరోమారు మోడీతో సమావేశమయ్యే అవకాశం రావడం చంద్రబాబుకు సువర్ణావకాశమేనని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో 2014లో పోటీ చేసినట్టే మూడు పార్టీలు జనసేన–టీడీపీ–బీజేపీ కలిసి పోటీ చేద్దామని కోరే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా డిసెంబర్ 5 నిర్వహించే సమావేశంలో భారత్లో నిర్వహించే జీ–20 భాగస్వామ్య దేశాల సదస్సుపై చర్చించనున్నారు. ఈ సమావేశంపై వివిధ రాజకీయ పార్టీల సూచనలు అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తెలుసుకోనుంది.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. జీ–20 దేశాల కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల ఇండోనేషియాలో జరిగిన సదస్సులో ఆ దేశ అధ్యక్షుడు నుంచి ప్రధాని మోడీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

Related Posts

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

Spread the love

Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

Spread the love

Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!