జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, మణుగూరు, మార్చి 23.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ – జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం పినపాక నియోజకవర్గం, మణుగూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఎ.ఐ.సి.సి అగ్రనేత రాహుల్ గాంధీ పై సూరత్ కోర్టు తీర్పును వెతిరేకిస్తు మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద టిపిసిసి సభ్యులు పినపాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చంద్ర సంతోష్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు శాంతియుత నిరసన మౌన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ చందా సంతోష్ మాట్లాడుతూ 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సభలో మోడీ గురించి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కి సూరత్ కోర్ట్ పరువు నష్టం కేసులో ఈ రోజు రెండేళ్ల జైల్ శిక్ష వేసిన తీర్పును ఖండిస్తూ 3 గంటల నుంచి 5 గంటల వరకు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరావు, మణుగూరు మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, బూర్గంపాడు మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, జిల్లా బి.సి సెల్ కార్యదర్శి పెనుగొండ సాంబశివరావు, బి.సి సెల్ మండల అధ్యక్షులు సత్యనారాయణ, మహిళా మండల అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య, గోగినేని వరలక్ష్మి, సీనియర్ నాయకులు ఆవులు సర్వేశ్వర రావు, చలపతిరావు, పాషా, యువజన నాయకులు వజ్జా మహేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.